ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో ఆశావహులు కేబినెట్ లో స్థానం దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి అవకాశాలపై నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవి కావాలని ఇంతవరకూ అడగలేదని రోజా తెలిపారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అనేది సీఎం జగన్ నిర్ణయిస్తారని ఆమె చెప్పారు. పార్టీ కోసం తాను ఎంత కష్టపడ్డానో జగన్కు తెలుసని ఆమె చెప్పుకొచ్చారు. తాను ఐరన్లెగ్ కాదని, చంద్రబాబు తనపై అలా దుష్ప్రచారం చేశారని నగరి ఎమ్మెల్యే రోజా చెప్పారు.
మరోవైపు చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఖాయమనే వార్తలొస్తున్నాయి. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి కూడా మంత్రి పదవి దక్కొచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. వీరిద్దరితో పాటు ఎమ్మెల్యే రోజాకు కూడా ఈ విడతలోనే మంత్రి పదవి దక్కుతుందా అనేది త్వరలో తెలియనుంది.