ఏపీకి ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించడంపై ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ రాజన్న రాజ్యం దిశగా వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించారని అన్నారు.
సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జగన్ నిర్ణయం రాజకీయాల్లో సంచలనం సృష్టించిందని అన్నారు. అందరికీ సమన్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. వైసీపీకి చెందిన మాట్లాడుతూ తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ లాంటి సీఎంను ఇంతవరకూ చూడలేదని మరో నేత బొత్స సత్యనారాయణ కొనియాడారు. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపుతున్న సీఎం జగన్ అని ప్రశంసించారు.