ఏపీ ప్రభుత్వం ఇటీవల రూ.2.24 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ లో వివిధ రంగాలకు కేటాయింపులను ఆ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా కూడా సోషల్ మీడియాలో దీనిపై పోస్టు చేశారు.
స్త్రీలకు ఉపయోగపడే పథకాలకు బడ్జెట్ లో అధిక కేటాయింపులు చేపట్టారంటూ సీఎంను కొనియాడారు. అక్క, చెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నారంటూ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్ చేయూత, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం, అమ్మ ఒడి అంటూ హర్షం వ్యక్తం చేశారు.