telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

నాలుగున్నరేళ్ల నుంచి నరకాసుర పాలన: ఎమ్మెల్యే రోజా

Nagari TDP Ticket Gali Brothers
రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల నుంచి సీఎం చంద్రబాబు నరకాసుర పాలన సాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కె రోజా మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో మహిళలకు ఏం మేలు చేశారని చంద్రబాబుకు ఓటేయాలని ప్రశ్నించారు. పసుపుకుంకుమ పేరుతో ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఇస్తున్న పోస్ట్‌డేటెడ్‌ చెక్కులను చూసి వారంతా నవ్వుకుంటున్నారని రోజా అన్నారు. 
పసుపుకుంకుమ పేరుతో చంద్రబాబు పగటి వేషగాడిలా నాటకాలాడుతున్నారన్నారు. పోస్ట్‌డేటెడ్‌ చెక్కులతో.. ఔట్‌డేటెడ్‌ సీఎం కొత్త నాటకాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు వ్యక్తిగతంగా చెక్కులు ఇవ్వడం లేదని గ్రూపు పేరిట చెక్కులు ఇస్తున్నారన్నారు. రూ.పది వేలు ఆర్థిక సాయం కానే కాదన్నారు.  కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేస్తే,  చెక్కుల పంపిణీ నిలిచిపోతుందని అందుకే చంద్రబాబు పోస్ట్‌డేటెడ్‌ చెక్కులతో మహిళలను మోసం చేస్తున్నారని రోజా ఆరోపించారు.

Related posts