telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

పవన్ కల్యాణ్ ని కలిసిన ఎమ్మెల్యే రాపాక

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో  జ‌న‌సేన పార్టీ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో సహా అందరూ ఓడిపోగా ఒకే ఒక్క ఎమ్మెల్యే ఎన్నికైన విషయం తెలిసిందే. తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నుంచి జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున శాస‌న‌స‌భ‌కు రాపాక వ‌ర‌ప్ర‌సాద్ విజయం సాధించారు. 

ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు. ఈరోజు  విజ‌య‌వాడ, ప‌డ‌మ‌ట లంక‌లోని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్వ‌గృహానికి వరప్రసాద్ వెళ్లారు. వ‌ర‌ప్ర‌సాద్‌ ని పవన్ సాద‌రంగా ఆహ్వానించి, అభినందనలు తెలిపారు. కాగా, తూర్పుగోదావ‌రి జిల్లా జనసేన పార్టీ అభ్య‌ర్థులతో ఈరోజు స‌మీక్ష స‌మావేశం నిర్వహించనున్నారు.

Related posts