పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై భారత వైమానికి దళాలు జరిపిన దాడులపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. భారత సైన్యాన్ని కొనియాడుతూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘పొద్దుగల పొద్దుగల మన భారత సైన్యం పాకిస్తాన్ లోపలికి పోయి దాదాపు వెయ్యి కేజీల బాంబును పేల్చి వచ్చింది. ఈ దాడిలో 300 మంది టెర్రరిస్ట్ లు మరణించి ఉంటారు. పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పిస్తామని మోదీ అన్నారు. అన్నట్టుగానే చేశారు.
మోదీ చేతల మనిషి అని కొనియాడారు. ఈ ఘటనపై భారత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాక్కు భారత సైన్యం వారితగిన రీతిలోనే జవాబిచ్చింది. భారత ప్రజలకు అభినందనలు. ఈ దాడులు జరిపిన భారత సైన్యానికి, ప్రధాని నరేంద్రమోదికి ధన్యవాదాలు. జై శ్రీరామ్ .. జస్ట్ ఇది సాంపిల్ మాత్రమే.. ఇంకా పాక్ను మొత్తం తగలబెట్టాలి. ఆ సమయం కూడా త్వరలో వస్తుంది.’ అని వ్యాఖ్యానించారు.
ఓటు హక్కుపై నిమ్మగడ్డ సంచలన వ్యాఖ్యలు…