telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మిస్టర్ ktr ఇది సిరిసిల్ల కాదు భాగ్యనగరం..

Raghunandan

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు టీఆర్‌ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఏమిచ్చింది ఏమిచ్చింది అని అడుగుతున్నావ్… భాగ్యనగరానికి నువ్వు ని కార్పొరేటర్ కానీ చేసింది ఏంది.. నువేమన్న సిరిసిల్ల నుండి తెచ్చి ఇస్తున్నవా అని ప్రశ్నించారు. మీ నాయనా చింతమడక కి లక్షా 50 వేలు ఇస్తే కేంద్రం 8 లక్షలు ఇస్తుందని…చర్య కి ప్రతి చర్య అలానే ఉంటుంది..మీరు ఒకటి అంటే రెండు అంటామని తెలిపారు. సీఎం కేసీఆర్‌కి సెక్యూలర్ అనే పదానికి అర్థం తెలుసా..మిస్టర్ ktr ఇది సిరిసిల్ల కాదు భాగ్యనగరమని ఫైర్‌ అయ్యారు. కబ్జాలు చేయడం అభివృద్దా, అరచకమా Ktr నాలుగేళ్ళ క్రితం అహ్మదాబాద్ కి స్టడీ టూర్ కి వెళ్ళాడని.. అంత గొప్పగా హైదరాబాద్ ని నాశనం చేయడం బీజేపీ నుండి కాదని పేర్కొన్నారు. మీ నాయనా ఫార్మ్ హౌస్ నుండి, నీ జనవడా ఫార్మ్ హౌస్ నుండి, ని చెల్లె బతుకమ్మ ద్వారా వచ్చిన డబ్బులు, ని బావ మొయినా బాద్ ఫార్మ్ హౌస్ నుండి తీసుకొచ్చి హైద్రాబాద్ అభివృద్ధి కి పెట్టావా అంటూ విమర్శలు చేశారు. మీ కార్పొరేటర్ ఇంటికి ఇంటి పన్ను 101 రూపాయి.. ఇది అరచకమా.. అభివృద్ధి భైంసా అరచకానికి బాద్యులు నీవా, ని నాయనా, ని బావ న, ని చెల్లెనా యుద్ధం యాడ చేస్తావ్.. చార్మినార్ దగ్గర చేస్తావా..  జంతర్ మంతర్ దగ్గర చేస్తావా.. రా సాయంత్రం ఫార్మ్ హౌస్ లో గ్లాస్ ల గలగల అనిపించడం యుద్ధం అనుకుంటున్నావా అంటూ తీవ్రస్థాయిలో దూషించారు. బండి సంజయ్ అనని మాటలు అన్నాడని దుష్ప్రచారం చేస్తున్నారు.. గ్రేటర్ ఎన్నికలను హిందు ముస్లిం యుద్ధం గా మార్చొద్దని ktr కి చెబుతున్నానని పేర్కొన్నారు.

Related posts