ఆంధ్రాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అలాగే వైసీపీ నేతలకు అసలే పడటం లేదు అనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నిమ్మగడ్డ నోటిఫికేషన్ విడుదల చేయడంతో మళ్లీ రాజకీయ దుమారం రేగింది. వరుసగా ఆయన మీద వైసీపీ నాయకులు విరుచుకు పడుతున్నారు. తాజాగా పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాకి భయపడుతూ మాట్లాడిన నిమ్మగడ్డ ఎన్నికలు పెడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పేర్కొన్నారు. గ్లాస్ బోర్డు వెనుక ఉండి కరోనా కి భయపడుతూ నిమ్మగడ్డ ప్రెస్ మీట్ పెట్టారన్న ఆయన నిమ్మగడ్డ ప్రెస్ మీట్ చంద్రబాబు ప్రెస్ మీట్ లా ఉందని పేర్కొన్నారు. నిమ్మగడ్డ ఒక మూర్ఖుడు అని ఉద్యోగ సంఘాలు ఎన్నికలు వద్దు అంటున్నా నిమ్మగడ్డ వినటమే లేదని అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ప్రజలకు ఉద్యోగుల ప్రాణాలకు ఏమన్నా అయితే బాధ్యత నిమ్మగడ్డ వహిస్తారా ? అని ఆయన ప్రశ్నించారు. నిమ్మగడ్డకి పిచ్చి పీక్ లెవెల్ కి వెళ్ళిందన్న ఆయన నిమ్మగడ్డ రమేష్ ఎందుకు గ్లాస్ అడ్డంపెట్టుకుని మీడియా తో మాట్లాడారో చెప్పాలి ! అని డిమాండ్ చేసారు. ఎన్నికలకు నిమ్మగడ్డ మాత్రమే సిద్ధంగా ఉన్నారన్న ఆయన ప్రజలు, ఉద్యోగులు సిద్ధంగా లేరనీ అన్నారు. చూడాలి మరి ఈ విషయం పై నిమ్మగడ్డ ఎలా స్పందిస్తాడు అనేది.
previous post
next post
పంత్ భారత జట్టుకే కెప్టెన్ అవచ్చు : అజహరుద్దీన్