తెలంగాణలో కాంగ్రెస్ను ఎలా అధికారంలోకి తీసుకురావాలన్నదానిపై.. తన దగ్గర ఓ మెడిసిన్ ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో మెజార్టీ మున్సిపాలిటీలు గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ను ఇప్పటికిప్పుడు మార్చాల్సిన పనిలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్గా ఉత్తమ్కుమార్రెడ్డినే కొనసాగించాలన్నారు. తాను కూడా టీపీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నానని జగ్గారెడ్డి తన మనసులోని మాట చెప్పారు. టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియాను కోరానని తెలిపారు.