లక్ష్మీపార్వతి వల్లే తనకు అప్పట్లో మంత్రి పదవి దక్కలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం నాడు కేసీఆర్ కేబినెట్లో ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను టీడీపీలో ఉన్న సమయంలో కేబినెట్లో తనకు అవకాశం కల్పిస్తానని ఎన్టీఆర్ అప్పట్లో హామీ ఇచ్చారని చెప్పారు.
కానీ తనకు లక్ష్మీపార్వతి వల్లే కేబినెట్లో చోటు దక్కలేదన్నారు. ఆ తర్వాత చంద్రబాబు కూడ తన కేబినెట్టో చోటు కల్పిస్తానని హామీ ఇచ్చారని ఆయన కూడా ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ఎర్రబెల్లి చెప్పారు. కేసీఆర్ తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తానని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.
తన కుటుంబానికి రక్షణ కల్పించకపోతే ఆందోళన: కోడెల