అధికార పార్టీ నేతల అసంతృప్తి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కర్నూలు జిల్లాలో పోలీసులు వేధిస్తున్నారనే ఆరోపణలతో మంత్రి భూమా అఖిలప్రియ ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వర్గీయుల ఇళ్లపై పోలీసులు ఆకస్మిక దాడులు చేయడాన్ని నిరసిస్తూ ఆమె తన గన్ మెన్లను వెనక్కు పంపారు.
తాజాగా ఆమె అన్నయ్య, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా బాటలోనే నడిచారు. ఏపీ ప్రభుత్వం కల్పించే భద్రత తనకు అవసరం లేదని స్పష్టం చేశారు. గన్మెన్లను తిప్పి పంపించారు. తన చెల్లెలికి లేని భద్రత తనకు కూడా అవసరం లేదని లేదని స్పష్టం చేశారు. గన్మెన్లు లేకుండానే సోమవారం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటున్నారు.