మిజోరాంలోని తూర్పు ఛాంపై జిల్లాలో గురువారం మూడు సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై ప్రకంపనల తీవ్ర 3.6 నుంచి 5.3 వరకు నమోదైనట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. తూర్పు ఛాంపై జిల్లా కేంద్రానికి 35 కిలో మీటర్ల దూరంలో ప్రకంపనలు సంభవించగా రోడ్లు, భవనాలతో సహా 31కి పైగా నిర్మాణాలు దెబ్బతిన్నాయి.
ఇక సాయంత్రం 5.37 గంటలకు తొలిసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రంత 5.3గా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.వరుసగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూప్రకంపనల్లో ఎలాంటి ప్రాన నష్టం జరగలేదు.
ట్రంప్ పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు…