ఫాక్స్ స్టార్ స్టూడియోస్ బ్యానర్ పై బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “మిషన్ మంగళ్”. ఈ చిత్రం ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్ ధావన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతుంది. 2013లో భారత్ చేపట్టిన ‘మంగళ్యాన్’ మిషన్ నేపథ్యంలో సాగే చిత్రమిది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని జగన్ శక్తి తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ కుమార్ ఇందులో రాకేష్ పాత్ర పోషిస్తున్నారు. తాప్సీ, విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్, కీర్తి కుల్హరి, షర్మన్ జోషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ఆగస్ట్ 15న సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భారతదేశం నుంచి అంగారకుడిపైకి పంపిన తొలి ఉపగ్రహం మంగళ్యాన్ కథ ఆధారంగా రాబోతున్న ఈ చిత్రం టీజర్ ఇటీవలే విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇటీవల ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ను జోరుగా చేస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా అక్షయ్ కుమార్.. తన తోటి నటీమణులతో కూర్చొని ఈ సినిమా విషయాలను మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో అక్షయ్.. తన కుర్చీలో కాస్తంత వెనక్కి వాలాడు. దీంతో పక్కనే ఉన్న సోనాక్షి సిన్హా అదే అదునుగా భావించి అక్షయ్ను ఏదో సరదకు తట్టింది. దీంతో అక్షయ్ కుమార్ కుర్చీతో పాటు వెనక్కి పడిపోయాడు. అక్కీ పడిపోతుండగా తాప్సీ పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అక్షయ్ ని చూసి అందరు ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు. సోనాక్షి మాత్రం పెద్దగా నవ్వుతూ ఉంది. అంతేకాదు ఆ తర్వాత సోనాక్షి మాట్లాడుతూ.. ఎవరైనా నాకు చిరాకు తెప్పిస్తే.. ఇలాగే చేస్తాను అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. అక్షయ్ మాత్రం సోనాక్షి చేసిన పనిని లైట్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను సోనాక్షి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. మొత్తానికి తమ సినిమా ప్రమోషన్లో భాగంగా అక్షయ్, సోనాక్షిలు చేసిన ఈ పని ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Sona, your laugh 😍🤭😅@sonakshisinha and @akshaykumar these two are so adorable 😂
Credits video by @sonamyheartbeat ❤️#SonakshiSinha #AkshayKumar #MissionMangal pic.twitter.com/bebhZxEj1B— Kay. (@RAslisona) 9 August 2019
అసభ్యపదజాలంతో రేణూదేశాయ్ పై మండిపడ్డ నెటిజన్