హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లో యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేట్కు చెందిన గాయత్రి(29) తను పనిచేసే సూపర్ మార్కెట్కు వెళ్తున్నానని బుధవారం మధ్యాహ్నాం ఇంటి నుంచి బయలు దేరింది.
సాయంత్రం అయినా యువతి తిరిగిరాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. ఎక్కడా యువతి ఆచూకి లభించకపోవడంతో గురువారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.