telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ కార్మికులవి .. గొంతెమ్మ కోరికలు .. : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

minister vemula prasanthreddy on rtc stricke

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల గొంతెమ్మ కోరికలు సరికాదని వ్యాఖ్యానించారు. 50వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల అనైతిక డిమాండ్లు తీర్చడం కంటే.. నాలుగు కోట్ల మంది ప్రజల అవసరాలు తీర్చడమే ప్రభుత్వానికి ముఖ్యమని అన్నారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువగా ఆర్టీసీ కార్మికులకు ఫిట్‌మెంట్ ఇచ్చామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై విపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి ప్రశాంత్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేశారా? అని ప్రశ్నించారు.

Related posts