telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పవన్ కు విజన్ లేదు ప్యాకేజ్ ఇస్తే చాలు: మంత్రి వెల్లంపల్లి

srinivasa rao minister

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. విశాఖలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కు విజన్ లేదని ప్యాకేజ్ ఇస్తే చాలని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని అన్నారు. రాజధాని రైతులకు అన్యాయం జరగదని, చంద్రబాబు ఉచ్చులో పడొద్దని రైతులకు సూచించారు.

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలన్న బీజేపీ కోర్ కమిటీ తీర్మానం గురించి వెల్లంపల్లి ప్రస్తావిస్తూ, అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు లక్ష కోట్ల రూపాయలను బీజేపీ కనుక ఇస్తే రాజధానిని ఇక్కడే కొనసాగిస్తామని, కేంద్ర నిధులను కన్నా లక్ష్మీనారాయణ తెప్పిస్తే ఆయన పేరిట రాజధానిని నిర్మిస్తామని సెటైర్లు విసిరారు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చవుతుందని ఆనాడు టీడీపీ, బీజేపీలు కేంద్రానికి చెప్పలేదా? అని వెల్లంపల్లి ప్రశ్నించారు.

awan

Related posts