telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతిలో ఒక మాట, విశాఖలో మరో మాట: చంద్రబాబు పై వెల్లంపల్లి విమర్శలు

srinivasa rao minister

మాజీ సీఎం చంద్రబాబు పై ఏపీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ లో ఆయా శాఖల అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ చంద్రబాబు అమరావతిలో ఒక మాట, విశాఖలో మరో మాట మాట్లాడటం సరికాదని అన్నారు. , రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ పని చేస్తున్నారని చెప్పారు. ఓ మతానికో, కులానికో, వర్గానికో, రాజకీయానికో భయపడి పని చేసే తత్వం జగన్ ది కాదని అన్నారు.

రైతుల ముసుగులో రాజకీయాలు చేయాలని విపక్ష పార్టీలు చేస్తున్న క్రీడను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. రైతులకు అండగా వైసీపీ ప్రభుత్వం ఉంటుందని అన్నారు. గతంలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసి, పరిపాలన సాగించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచాయని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలతో అంచనా వేయడం చంద్రబాబు రాజకీయ డ్రామా అని విమర్శించారు. రాజధాని విషయంలో ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Related posts