telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వ నిర్ణయం వల్ల పౌల్ట్రీ రంగానికి భరోసా: తలసాని

talasani srinivasayadav on clp merger

లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పౌల్ట్రీ రంగానికి ఎంతో భరోసాను కల్పించిందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. చికెన్‌, గుడ్లు తినాలని ప్రభుత్వం విస్తృత ప్రచారం కల్పించి ఆపదలో ఉన్నపౌల్ర్టీ రంగానికి అండగా నిలిచిందని చెప్పారు. పౌల్ట్రీ రంగ అభివృద్ధికి మంత్రి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం గురువారం సమావేశమైంది.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ పౌల్ట్రీ రంగానికి 5లక్షల మెట్రిక్‌టన్నుల మక్కలను సరఫరా చేస్తామన్నారు. రవాణా ఖర్చులను పౌల్ర్టీ నిర్వాహకులే భరిస్తారని అన్నారు. క్వింటాల్‌ 1,525 రూపాయలకు మక్కలన సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. కరోనా కారణంగా నష్టపోయే పరిస్థితుల్లో ఉన్న పౌల్ట్రీ రంగం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతోపుంజుకుని సాధారణ స్థితికి చేరుకుందన్నారు.

Related posts