telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరంజీవి, నాగార్జునతో తలసాని భేటీ… కీలక అంశాలు ఇవే…!

Tollywood

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మరికొంత మంది టాలీవుడ్ పెద్దలు కలిసి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో సోమవారం నాడు భేటీ అయ్యారు. సినీపరిశ్రమ పురోభివృద్ధే ధ్యేయంగా ఈ కీలక భేటీ జరిగింది. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమంపై మంత్రి తలసానిని కలిసి కీలక విషయాలపై చర్చించిన చిరు, నాగ్‌లు మరోసారి భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన కీలక భేటీ జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టుడియోలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోమ్, రెవెన్యూ, న్యాయశాఖ,కార్మిక శాఖ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు మంత్రి తలసాని. ఈ భేటీలో చర్చించిన కీలక అంశాలు ఏంటంటే…

ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కోసం శంషాబాద్ పరిసరాలలో స్థలం సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించిన మంత్రి.
కల్చరల్ సెంటర్, స్కిల్ డవలప్ మెంట్ కేంద్రం కోసం అవసరమైన స్థలాలు సేకరణ.
సినీ, టి వి కళాకారులకు ఇండ్ల నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలాన్ని సేకరించాలని ఆదేశం.
సింగిల్ విండో విధానంలో షూటింగ్‌లకు త్వరితగతిన అనుమతులు.
ఎఫ్ డీ సీ ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు అందించేందుకు చర్యలు.
సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పైరసీ నివారణకు పకడ్బందీ చర్యలు.
టికెట్ల ధరల సరళీకృత విధానం
సినీపరిశ్రమతో పాటుగా టీవీ కళాకారులకు ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులు.
వీటితో పాటు సినీ అవార్డుల ప్రధానం, ప్రభుత్వ పథకాలను సినీ కార్మికులకు వర్తింపు, ఈ.ఎస్.ఐ- గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు తదితర ప్రతిపాదనలను తెలియజేశారు సినీపెద్దలు.

Related posts