telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

‘మహర్షి’ ధరలు పెంచడంపై మంత్రి తలసాని ఫైర్

Minister Talasani Fire to Chandrababu

మహేశ్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా రేపు తెలంగాణలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో థియేటర్లు, మల్టిప్లెక్స్ యాజమాన్యాలు టికెట్ల ధరలను ఒక్కసారిగా పెంచేయడంపై తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ సీఎస్ తో తలసాని ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. న్యాయశాఖ, హోంశాఖ కార్యదర్శితోనూ ఆయన పరిస్థితిని సమీక్షించారు.

ఈ వ్యవహారంలో హైకోర్టుకు వెళ్లాలని మంత్రి నిర్ణయించారు. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే ఆలోచన ప్రభుత్వం చేయదని స్పష్టం చేశారు. ఈ విషయంలో చట్టపరంగా ముందుకు వెళ్లాలని హోంశాఖ కార్యదర్శికి సూచించానని స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే 79 థియేటర్లు ధరలను పెంచాయని మంత్రి మండిపడ్డారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని తలసాని హెచ్చరించారు.

Related posts