నగరంలో అభివృద్ధిపనులకు అడ్డంకిగా ఉన్నఅక్రమ నిర్మాణాలను తక్షణం తొలగించాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం బేగంబజార్లోని ఓల్డ్ పోలీస్స్టేషన్ వద్ద 2.25 కోట్ల రూపాయల వ్యయంతో స్టీల్గైడర్లతో నిర్మిస్తున్నవంతెన పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఒక నిర్మాణం నాలా పనులకు అడ్డంకిగా ఉందని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.వెంటనే అక్రమ నిర్మాణాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
అదే విధంగా నాలా నిర్మాణ పనులకు వాటర్పైప్లైన్ అడ్డుగా ఉందని, వాటర్వర్క్స్, హెచ్ఆర్డి అధికారులు సమన్వయంతో వ్యవహరించి పనులుసాగేలా చూడాలని అన్నారు. స్థానిక వ్యాపారులు తమ వాహనాలను ఇష్టమొచ్చినట్టు నిలపకుండా అధికారులకు సహకరించాలని చెప్పారు.