ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి పై ప్రసంగిస్తారని తెలిపారు. 5 రోజులుగా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారన్నారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఐదేళ్లలో జరిగాయన్నారు. నిరంతర విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావొస్తున్నాయని తలసాని పేర్కొన్నారు.
సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట్ర అవతరణ వేడుకలకు భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు. జీఏడీ తరుపున అందించిన ఇన్విటేషన్లో ఎంట్రీ, పార్కింగ్ వివరాలు అన్ని పొందుపరిచామని అంజనీ కుమార్ తెలిపారు.
భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు చీకటి దినం: మాజీ సీఎం ముఫ్తీ