telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమ్మఒడి పథకం వారికే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి సురేష్

suresh adimulapu minister

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమ్మఒడి పథకంపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. అమ్మఒడి పథకం ప్రస్తుతానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకే వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్ల విద్యార్ధులకు అమ్మఒడి వర్తింప చేసే అంశంపై మేథోమధనం చేస్తున్నామన్నారు.

డ్రాప్‌ఔట్ల సంఖ్య తగ్గించేందుకే అమ్మఒడి పథకం తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అమ్మఒడి పథకం విధి విధానాలు తెలియకుండా ఆ పేరు చెప్పి అడ్మిషన్లు తీసుకునే స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమ్మఒడి పథకం వర్తింపునకు ఇంకా ఆరు నెలల సమయం ఉందని మంత్రి తెలిపారు.

Related posts