telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌‌కు చంద్రబాబును విమర్శించే స్థాయిలేదు: సోమిరెడ్డి

Minister somireddy resign Mlc

తెలంగాణా సీఎం కేసీఆర్‌కు ఏపీని అభివృద్ధి చేస్తున్న సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయిలేదని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఆర్థిక లోటులో ఉన్నా అన్ని విధాలా ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణా కంటే ఎంతో ముందంజలో ఉందన్నారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆదివారం నిర్వహించిన జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో రైతులకు రాష్ట్రంలో 3300 కోట్ల ఇన్‌ పుట్‌ సబ్సిడీ ఇచ్చామని, మరో 2వేల కోట్లు ఇవ్వనున్నామన్నారు. తెలంగాణాలో కేవలం 1,200 కోట్ల రూపాయల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చారన్నారు.

నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో 370 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, తెలంగాణాలో 4వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నా రు. వాటిని సైతం నివారించాలని తాము ప్రయత్ని స్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో దేశంలోనే వృద్ధి రేటులో నెంబర్‌వన్‌ స్థానంలో ఉన్నామన్నారు. డీబీటీ విధానంలో అత్యధికంగా రాష్ట్రంలోని 39 వేల మంది రైతులు సబ్సిడీ ద్వారా యంత్ర పరికరాలు పొందారని, తమిళనాడును నుంచి 1700 మంది తప్ప మరే రాష్ట్రం నుంచి ఉపయోగించుకోలేదన్నారు. ఇన్ని విధాల అభివృద్ధి చేస్తున్న సీఎం చంద్రబాబును అభివృద్ధి అంటే తెలియదని కేసీఆర్‌ విమర్శించడం హాస్యాస్పదమన్నారు.

Related posts