telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు: మంత్రి సత్యవతి

sathyavathi rathod

రైతుల కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. వరంగల్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌ రావు ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో రైతులంతా ఏకపక్షంగా తీర్పునిచ్చారని తెలిపారు.

రైతులకు 24 గంటల కరెంట్‌, రైతుబంధు, రైతుబీమా ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ ఏడాది నుంచి రుణమాఫీ కూడా ఇవ్వబోతున్నట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కొత్త సంస్కరణలు, పాలనతో రైతుల నమ్మకాన్ని చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పొందాలని పేర్కొన్నారు.

Related posts