*చంద్రబాబు లోకేష్ ఎన్ని సార్లు చెయ్యాలి..
*ఎంపీ మాధవ్ తప్పు చేసి ఉంటే సీఎం జగన్ చర్యలు తీసుకుంటా
*నేను లంచాలు తీసుకుని కారు కొన్నానని ఆరోపిస్తున్నారు
*బ్యాంక్ లావాదేవీలు చూస్తే తెలుస్తోంది..
ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై మంత్రి రోజా స్పందించారు. మాధవ్ రాజీనామా చేయాలంటే.. చంద్రబాబు, లోకేష్ ఇప్పటికి వందసార్లు రాజీనామా చేయాల్సి ఉండేదన్నారు. చంద్రబాబు పాలనలో 5 ఏళ్ల మైనర్ బాలికతో పాటు పిచ్చివాళ్లపై కూడా అత్యాచారాలు చేసిన ఘటనలు ఉన్నాయన్నారు.
నారాయణ కాలేజీలో ఎంత మంది ఆడపిల్ల జీవితాలు అర్ధాంతరంగా ఆగి పోయాయో అందరం కళ్లారా చూశమని.. ఏ రోజైనా.. ఏ ఘటనపైన అయినా ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు ఎలాంటి వారో.. ఆ పార్టి మహిళా నాయకులే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారని గుర్తు చేశారు. ఎంపీ మాధవ్ తప్పు చేసి ఉంటే ఆయనపై ఖచ్చితంగా సీఎం జగన్ చర్యలు తీసుకుంటారన్నారని మంత్రి రోజా చెప్పారు.
విచారణకు టైం ఉంటుంది. వీడియో ఫేక్ నా, నిజమైనదా అని తెల్చచడానికి టైం పడుతుంది. అంతవరకు వెయిట్ చేయాలని సూచించారు. సీఎం మహిళా పక్షపాతి. మహిళల రక్షణకు భద్రతతో పాటు వాళ్ళ ఆర్థికంగా నిలబెట్టేందుకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని గుర్తు చేశారు.
ఇటీవల తాను కొత్త కారును కొనుగోలుకు చేందిన ఓ ఫోటో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. లంచం తీసుకుని కారు కొన్నట్లుగా ప్రచారం చేయడం దారుణమన్నారు
కన్న కొడుక్కి కారు కొని ఇవ్వడం తప్పా అని ప్రశ్నించారు.. లంచాలు తీసుకుని కారు కొన్నట్టుగా ప్రచారం చేయడం.. చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు.. తాను ఇప్పటికే150 సినిమాలు చేసానని, ఎన్ని లక్షల రూపాయలు జబర్దస్త్ లో రెమ్యూనేషన్ తీసుకుంటానో.. తన అకౌంట్ చూస్తే అర్ధం అవుతుందన్నారు, ఇదేమి తెలియని, చదువు రాని దద్దమ్మలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.