ఏపీ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి తన పెళ్లి గురించి ప్రస్తావించారు. ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్న వేళ, కాబోయే భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాబట్టే పెళ్లికి అంగీకరించానని తెలిపారు. ఇదే విషయాన్ని పెళ్లికి ముందే ఆయనతో చెప్పానని వెల్లడించారు.
తనకు భర్తగా అనుకుంటున్న వ్యక్తి వైసీపీ నేత కాకుంటే, పెళ్లికి అంగీకరించి వుండేదాన్ని కాదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తనకు దేవుడివంటి వాడని చెప్పుకొచ్చారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గం నుంచి గెలుపొందిన పుష్ప శ్రీవాణి జగన్ కేబినెట్ లో స్థానం లభించిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు కావాలనే రెచ్చగొడుతున్నాడు: మంత్రి అవంతి