telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

భావోద్వేగానికి గురైన మహిళ మంత్రి.. కన్నీటిని ఆపుకుంటూ ప్రసంగం!

pushpa sreevani

ఏపీ మంత్రి పుష్పశ్రీవాణి ఈరోజు శాసనసభలో భావోద్వేగానికి గురయ్యారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆమె స్పీకర్ కు ధన్యవాద తీర్మానం వేళ ప్రసంగించారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి కన్నీటిని ఆపుకుంటూ తన ప్రసంగం కొనసాగించారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో ఈ శాసనసభ విశ్వసనీయతలతో నడుస్తుందని ధీమాగా చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలవడం ఇది రెండోసారని తెలిపారు. గతంలో మొదటి పర్యాయం అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు రాజ్యాంగ విలువలను పాటించలేదన్నారు.

ఆ సమయంలో జగన్ తన వయసుకు మించిన పరిణతి చూపించి ప్రతిపక్షనేతగా ఎంతో హుందాగా వ్యవహరించారంటూ ఆమె కొనియాడారు. ఓ గిరిజన మహిళనైన తనను రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా చేసిన ఘనత సీఎం జగన్ కే చెల్లుతుందని అన్నారు. సమాజంలో అణగారిన వర్గాలకు కూడా తమ గొంతుక వినిపించే అవకాశం కల్పించడం ద్వారా జగన్ ఇతర రాష్ట్రాలకు సైతం స్ఫూర్తిగా నిలవడమే కాకుండా, దేశానికి గొప్ప సంకేతం పంపారని కొనియాడారు.

Related posts