కొండవీడులో హెలిపాడ్ కోసం రైతు కోటయ్య భూమి తీసుకున్నామని జగన్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేవారు. ఒకవేళ నిరూపించలేకపోతే వైసీపీ అధినేత జగన్ రాష్ట్రాన్ని విడిచిపోవాలని మంత్రి సవాల్ విసిరారు. కోటయ్య మృతి పై వాస్తవాలు తెలుసుకునేందుకు మంత్రి ప్రతిపాటి బుధవారం కొండవీడులో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు మృతిని వైసీపీ రాజకీయం చేస్తుందని మంత్రి మండిపడ్డారు. రైతు కోటయ్య భూమి హెలిపాడ్ కు 700 కిలోమీటర్ల దూరంలో ఉంటుదని, ఆ భూమిలోకి పోలీసులు ఎవరు వెళ్లలేదని తెలిపారు.
కోటయ్య కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామని మంత్రి పుల్లారావు హామీ ఇచ్చారు.కొండవీడులో రైతు కోటయ్య మృతిపై ఫోరెన్సీక్ నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు బయటపడతాయన్నారు. రైతు ఆత్మహత్య చేసుకుంటే కాపాడేందుకు ఎంతగానో శ్రమించారని, భుజాల మీద వేసుకుని ఒక కాంట్రాక్టర్కి చెందిన కారులో ఫిరంగిపురం ఆసుపత్రికి తరలించారని చెప్పారు. రైతును కాపాడేందుకు ప్రయత్నించిన పోలీసులపై వైసీపీ నేతలు బురద చల్లారని పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోడీ గారడి మాటలకు ఓట్లు పడవు: చంద్రబాబు