telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కుట్రలను బహిర్గతం చేసేందుకే ఢిల్లీకి : మంత్రి ప్రత్తిపాటి

ప్రధాని మోదీ, అమిత్ షా కుట్రలను బహిర్గతం చేసేందుకే ఢిల్లీకి వచ్చామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈరోజు ఢిల్లీలో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, వర్లరామయ్యతో కలిసి ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరించిందని విమర్శించారు. బీజేపీ బ్రాంచ్ కార్యాలయంగా ఈసీ మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోతారని హెచ్చరించారు. మరోవైపు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. దేశంలోని 22 రాజకీయ పార్టీలు 50 శాతం వీపీప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సిందిగా కోరాయని గుర్తుచేశారు. ఈవీఎంలు మొరాయించడంతో ఓటు వేసేందుకు క్యూలైన్లలో నిలబడ్డ మహిళలు తీవ్ర ఇబ్బందులేదుర్కొన్నారని పేర్కొన్నారు.

Related posts