telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

వైసీపీ నేతలు దొంగలను పంపారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:  పరిటాల సునీత

Paritala Sunitha Kanvyai Ladies Break
ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు వైసీపీ నేతలు దొంగలను ఊర్లలోకి పంపారని ఏపీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని సునీత ఆవిష్కరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వైసీపీ నేతల విషయంలో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిసూచించారు. ఓట్లను తొలగించాలని చంద్రబాబు ఎన్నడూ చెప్పలేదనీ అది  జగన్ తత్వమని అన్నారు. 
నేరప్రవృత్తి కలిగిన జగన్ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.అలాంటి వ్యక్తులు తమపై తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు సైతం లబ్ధి పొందారని మంత్రి గుర్తుచేశారు. అలాంటప్పుడు రాబోయే ఎన్నికల్లో అసలు వైసీపీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Related posts