తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్లో కూర్చొని కుట్రలు చేస్తున్నారని మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్ ఏపీకి వచ్చి.. జగన్తో కలిసి పోటీ చేయాలని మంత్రి సవాల్ విసిరారు. హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్పై రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో ఆస్తులు పోతాయనే భయంతోనే పార్టీ మారుతున్నారని విమర్శించారు.
అమలాపురం ఎంపీ రవీంద్రబాబువి నైతిక విలువలు లేని రాజకీయాలు అని మండిపడ్డారు. స్వార్థం కోసం పార్టీలు మారుతున్నారన్నారు. కేసీఆర్, కేటీఆర్ వీళ్లతో మాట్లాడి పార్టీ మార్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక కేసుల నుంచి బయటపడడానికి జగన్.. మోదీకి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. బీసీల గురించి జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి దుయ్యబట్టారు.
బొత్స తానే సీఎంలా మాట్లాడుతున్నారు: పవన్ విమర్శలు