telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మంత్రి మల్లారెడ్డిపై హెచ్చార్సీలో మహిళ ఫిర్యాదు

Minister Mallareddy letter pad soial media |

తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై పి.శ్యామలాదేవి అనే మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. మంత్రి మల్లారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మేడ్చెల్ జిల్లా సూరారంలో తనకు చెందిన 33 కుంటల భూమిని మంత్రి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

మంత్రి మల్లారెడ్డికి సూరారంలో రెండు ఆసుపత్రులు ఉన్నాయని, ఆ ఆసుపత్రుల మధ్యలో తన స్థలం ఉండడంతో కబ్జా ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అధికారులు సైతం మంత్రికే వత్తాసు పలుకుతున్నారని శ్యామలా దేవి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆమె హెచ్చార్సీకి విజ్ఞప్తి చేశారు.

Related posts