telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన జడ్పీ హెచ్ ఎం!

ktr trs

తెలంగాణ మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఓ హెడ్ మాస్టర్ ఫోర్జరీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా రావులపెంట జిల్లాపరిషత్ హైస్కూల్ లో హెడ్ మాస్టర్ గా పని చేస్తున్న మానవత్ మంగళ తన పదోన్నతి కోసం కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

జిల్లా ఓపెన్ స్కూల్ లో కోఆర్డినేటర్ పోస్ట్ కోసం ఆమె కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. నకిలీ లెటర్ హెడ్ పై కేటీఆర్ సంతకం ఉన్నట్టు సృష్టించిన లేఖతో కోఆర్డినేటర్ పోస్టులో గత కొంత కాలంగా మంగళ కొనసాగుతున్నారు. ఈ విషయం వెలుగు చూడటంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

Related posts