telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గిప్ట్ ఏ స్మైల్ : అంబూలెన్స్ ను ప్రారంభించినకేటీఆర్

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తన పుట్టిన రోజు సందర్భంగా “గిప్ట్ ఏ స్మైల్” కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ అంబూలెన్స్ ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. గిప్ట్ ఏ స్మైల్ లో భాగంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో అంబూలెన్స్ ను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. పేదలకు, కరోనా బాదితులకు అంబూలెన్స్ లను మరింత అందుబాటులోకి తేవాలని ఐటీ&పురపాలక శాఖమంత్రి కే.టీ.రామారావు పుట్టిన రోజు సందర్బంగా గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అంబూలెన్స్ అందించడానికి ముందుకువచ్చారు. ఈ రోజు ప్రగతి భవన్ లో మంత్రులు కే.టీ .రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ మాలోత్ కవిత , ఎమ్మెల్సీ పోచంపల్లి అంబూలెన్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపి మాలోత్ కవిత,ఎంపీ గడ్డం రంజీత్ , టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ వై సతీష్ రెడ్డి, జెడ్పిటిసీ గుడి వంశీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Related posts