గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ జంక్షన్లో శనివారం జరిగిన ప్రమాదంపై అధ్యయనం చేసేందుకు కమిటీని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ ప్రమాద ఘటనపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ముగ్గురు సభ్యులతో మంత్రి కేటీఆర్ కమిటీ ఏర్పాటు చేశారు. చీఫ్ ఇంజినీర్ శ్రీధర్తో పాటు లీ అసోసియేట్స్ ప్రైవేటు సంస్థతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఫ్లై ఓవర్ డిజైన్, ప్రమాద నివారణ చర్యలపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. కమిటీ బృందం నేడు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంపై జరిగిన తీరును ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిది. అంతేకాక మూడు రోజుల్లో ఫ్లైఓవర్ డిజైన్పై నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది.