telugu navyamedia
తెలంగాణ వార్తలు

డబ్బు సంచులతో దొరికినోడు..పీసీసీ చీఫ్‌ అంట..

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఊరూరు తిరుగుతూ మొత్తం నిధులు కేంద్రానివే అని అబద్ధాలు చెప్తున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం ‘గద్వాల్ ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ’లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు..ఈ వేదిక మీద నుండి సవాల్ విసురుతున్నాను.. బండి సంజయ్ చెప్పేది నిజమైతే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. అబద్ధం అయితే బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలి అని, దమ్ముంటే రుజువు చేయు…లేకుంటే రాజీనామా చేయి అంటూ సావాల్ విసిరారు.

చరిత్ర తప్ప.. భవిష్యత్ లేని పార్టీ కాంగ్రెస్ అని కేటీఆర్‌ విమర్శించారు. ’ డబ్బు సంచులతో దొరికినోడు పీసీసీ చీఫ్‌ అంట.. వాడు కూడా మాట్లాడుతున్నడు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు కూడా ఇవ్వదని దద్దమ్మలున్నది కాంగ్రెస్‌ పార్టీ అని.. పాలమూరు వలసల జిల్లాగా మార్చిన ఘనత పార్టీదేనన్నారు. ప్రస్తుతం వలసలు వెళ్లిన వారంతా తిరిగి వస్తున్నారని, పాలమూరు పచ్చబడుతున్నదన్నారు. పాలమూరు పచ్చబడుతుంటే కాంగ్రెస్‌ నేతల కండ్లు మండుతున్నాయని, కేసీఆర్ ని తిడితే పెద్ద నాయకులు కాలేరు. రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి అయిన నాయకుడు సీఎం కేసీఆర్.

దేశంలో రైతుల కోసం రైతు బంధు పెట్టిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని, స్థానిక రైతులు, రైతు కూలీలతో మాట్లాడితే రైతు బీమా, రైతు బంధు, ఆసరా పింఛన్ పథకాల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. పక్కనే బీజేపీ ప్రభుత్వం ఉన్న కర్ణాటక రాయ్ చూరులో మన రాష్ట్రంలోని పథకాలు లేవు. ఇక్కడ బీజేపీ నాయకురాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్ పథకాలతో ఆడబిడ్డలకు భరోసా కల్పించినార‌ని కేటీఆర్ అన్నారు..

Related posts