రాష్ట్రంలోని స్థిరాస్థి రంగానికి ఎలాంటి ఢోకాలేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో-2020 ను ఈరోజు ఆయన ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ పశ్చిమ హైదరాబాద్ లో నిర్మాణాలు చేస్తున్న బిల్డర్లు, కాలుష్యం లేకుండా నిర్మాణంలో నూతన టెక్నాలజీ ఉపయోగించాలని సూచించారు. నిర్మాణ ప్రాంతాల్లో దుమ్మూధూళి లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
భవన నిర్మాణ అనుమతుల కోసం టీఎస్-బీ పాస్ తీసుకొస్తామని వెల్లడించారు. టీఎస్ ఐపాస్ లాగానే టీఎస్ బీపాస్ కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, కేవలం హైదరాబాద్ పైనే కాకుండా రాష్ట్రంలోని ఇతర నగరాలపైనా నిర్మాణ రంగ సంస్థలు దృష్టి పెట్టాలని సూచించారు. బిల్డర్లు స్వీయ నియంత్రణ పాటించాలని అన్నారు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో లక్షలాది మందికి ఉఫాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు.
సమస్యలపై రాసిన లేఖలకు జగన్ నుంచి స్పందన లేదు : కన్నా