భద్రతా బలగాల కదలికల గురించి సమాచారం అందించేందుకు పిల్లల సేవలను మావోయిస్టులు వినియోగించుకుంటున్నట్టు సమాచారం ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. జార్ఖండ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో వంట చేయడానికి , నిత్యావసర వస్తువులను తీసురావడానికి వాళ్ళను వాడుకునున్నారని తెలిపారు. అభంశుభం తెలియని పిల్లలను చేర్చుకుని వారికి మావోయిస్టులు మిలిటరీ ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పారు.
మావోయిస్టుల ప్రభావం ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని, కేంద్ర బలగాలు, హెలికాప్టర్లను సమకూర్చుతోందని చెప్పారు. పోలీసు బలగాల ఆధునికీకరణ స్కీం కింద నిధులను కూడా అందిస్తోందని తెలిపారు. గతంలో పోల్చితే మావోయిస్టుల హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయని ఆయన పేర్కొన్నారు.