telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తిరుమల పవిత్రతను కాపాడేందుకు చర్యలు: కిషన్ రెడ్డి

BJP Kishan Reddy Says Threatening Calls

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో పాటు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం తిరుమల తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశంలో శాంతిభద్రతలు బాగుండాలని స్వామి వారిని కోరుకున్నట్టు తెలిపారు.

మోదీ నేతృత్వంలో దేశంలో మంచి పాలన జరగాలని స్వామి వారిని కోరుకున్నట్టు చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పూర్తిగా అడ్డుకుంటామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకోవడానికి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అధికారులతో మాట్లాడుతానని చెప్పారు.

Related posts