telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రయాణికులను కాపాడిన వారికి రూ.25 వేలు!

team found difficult to bring boat

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు ప్రమాదంలో ప్రయాణికులను రక్షించినవారికి ఏపీ సర్కారు నజరానా ప్రకటించిందని మంత్రి కన్నబాబు తెలిపారు. బోటు ప్రమాదంలో ప్రయాణికులను రక్షించినవారికి నగదు పురస్కారం అందజేయనున్నట్టు తెలిపారు. ఒక్కొక్కరికీ రూ.25 వేలు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని వెల్లడించారు.

బోటు ప్రమాదంలో గల్లంతైన 14 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని, బోటును గోదావరి గర్భం నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నామని కన్నబాబు చెప్పారు. ఇలాంటి చర్యలు మరోసారి జరగకుండా చర్యలు చేపట్టామని వివరించారు. కచ్చులూరు బోటు మునక వ్యవహారంలో ఉన్నతస్థాయి కమిటీతో పాటు మెజిస్టీరియల్ విచారణ కూడా జరుగుతోందని అన్నారు.

Related posts