telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు: మంత్రి ఐకె రెడ్డి

indrakaran reddy

సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని కాల్వ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు బాగుపడాలనేదే కేసీఆర్ ధ్యేయమని అన్నారు.

ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా, నాణ్యమైన ఎరువులు సకాలంలో అందిస్తున్నమని తెలిపారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి నియమించి రైతులకు సలహాలు సూచనలు అందించడం జరుగుతుందన్నారు.

Related posts