హుజూర్నగర్ ఉప ఎన్నికల ఫలితం ప్రతిపక్షాలకు చెంపపెట్టు అని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమపథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయి.
అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా రూ.339 కోట్లు ఇస్తున్నాం. 30 రోజుల ప్రణాళికతో గ్రామాల ముఖచిత్రాన్ని మార్చుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.