telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రెండు కోట్ల మందికి రేషన్‌ సౌకర్యం: మంత్రి గంగుల

gangula kamalakar trs

చిన్న రాష్ట్రమైనా 2.66 కోట్ల మంది లబ్దిదారులకు రేషన్‌ సౌకర్యం కల్పిస్తున్నామని తెలంగాణ బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ పేదలకు అన్నం పెట్టే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. పేదలకు అందాల్సిన బియ్యం అక్రమరవాణా జరగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందన్నారు.

పేదలు ఆకలితో అలమటించకూడదనే సీఎం కేసీఆర్‌ రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నారని తెలిపారు. రేషన్‌ డీలర్ల కమీషన్‌ కూడా మళ్లీ పెంచుతామని సీఎం చెప్పారని మంత్రి గంగుల స్పష్టం చేశారు. రేషన్‌ షాపుల సంఖ్యను పెంచే అంశం పరిశీలనలో ఉందని, త్వరలోనే నిర్ణయం తెస్సుకుంటామని తెలిపారు.

Related posts