telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కొన్ని పత్రికల్లో అసత్య వార్తలు.. సంయమనం పాటించాలి: మంత్రి ఈటల

Etala Rajender

కొన్ని వార్తా పత్రికల్లో వస్తున్న అసత్య వార్తలపై స్పందించవద్దని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆ పార్టీ శ్రేణులను కోరారు. కొత్త రెవిన్యూ చట్టానికి సంబంధించి కీలకమైన సమాచారాన్ని రెవిన్యూ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి ఈటల రాజేందర్ లీక్ చేశారనే ప్రచారం సాగుతోంది.

ఈ విషయమై కేసీఆర్ ఇంటలిజన్స్ అధికారులతో సమాచారాన్ని తెప్పించుకొన్నారని అంటున్నారు.ఈ విషయమై కేసీఆర్ మంత్రి ఈటల తీరుపై ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది.ఈ తరుణంలో మీడియాలో కూడ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి  వార్తలపై ఎవరూ కూడ స్పందించవద్దన్నారు. సోషల్ మీడియాలో కూడ టీఆర్ఎస్ శ్రేణులు ఇలాంటి వార్తల పై సంయమనం పాటించాలని ఆయన సూచించారు.

Related posts