ఆర్టీసీ కార్మికులను తాను పల్లెత్తు మాట కూడా అనలేదని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ కార్మికుల పక్షమేనని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు విపక్షాల ఉచ్చులో చిక్కుకున్నట్టు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. తనపై కార్మిక సంఘాలు చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు అంతటివాడినే బెదిరించి ప్రత్యేక తెలంగాణ కోసం లేఖ అడిగానని చెప్పారు. అలాంటి తనను తెలంగాణ ద్రోహి అనడం తగదని ఎర్రబెల్లి ఆక్రోశించారు. తెలంగాణ ఉద్యమంలో జైలుకెళ్లిన చరిత్ర తనదని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు.