telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు: మంత్రి ఈటల

Etala Rajender

అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ…రోజుకు 17 వేల వరకు పరీక్షలుచేస్తున్నట్టు వెల్లడించారు. రిటైర్డ్ డాక్టర్లను సేవలు అందించాలని కోరాం అన్నారు. ప్రస్తుతం వెలుగు చూస్తున్న కేసుల్లో 19 శాతం మందికి లక్షణాలు ఉంటున్నాయని తెలిపారు.

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి వైద్యం అందిస్తున్నామన్నారు. కరోనా రోగుల్లో కేవలం ఐదు శాతం మందికే ఆక్సిజన్ అవసరం అవుతుందని తెలిపారు. బస్తీల్లో వయసు పై బడిన వారి నుంచి స్వాబ్ కలెక్షన్ చేయడానికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామన్నారు ఈటల. కంటైన్మెంట్ జోన్లలో వీటిని అందుబాటులో ఉంచుతామని తెలిపారు. వైద్య సిబ్బంది ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.

Related posts