telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విభజన వల్ల రాజధానిని నష్టపోయాం: మంత్రి ధర్మాన

dharmana krishna das ycp

గతంలో 60ఏళ్లు కష్టపడి నిర్మించుకున్న రాజధానిని విభజన వల్ల నష్టపోయామని ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు.గత తప్పిదాలు పునరావృతం కాకూడదనే మూడు రాజధానుల ఆలోచన చేస్తున్నామని చెప్పారు రాజధాని ఒకే చోట ఉండటం వల్ల దృష్టి ఆ ప్రాంతంపైనే ఉంటుందనన్నారు.

శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల వారికి అభివృద్ధి ఫలాలు అందాలన్నదే సీఎం జగన్ ఆకాంక్షని చెప్పారు. రాజధాని ప్రాంతాల్లోని రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. రాజధాని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందన్నారు. అమరావతికి ఎలాంటి నష్టం జరుగొద్దనే అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. 

Related posts