ఏపీ సీఎం జగన్ చేసిన రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రకటన పై అమరావతి రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఉదయం విజయవాడలోని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన ఇంటిని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ముట్టిడించారు.
టీఎన్ఎస్ఎఫ్ ఏపీ అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం ఆధ్వర్యంలో బొత్స ఇంటి ముట్టడిలో పలువురు నాయకులు పాల్గొన్నారు. రాజధానిపై బొత్స చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు. బొత్స మంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని సూర్యారావు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
జగన్ కేబినెట్ లో సామాజికవర్గాలకు ప్రాధాన్యత: కృష్ణం రాజు