telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఐదు నెలల్లోనే ఇచ్చిన హామీలకు చట్టబద్ధత: మంత్రి బొత్స

అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అనంతపురంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెట్టుబడుల పేరుతో దోపిడీ విధానాన్ని మాత్రం తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించదని ఆయన స్పష్టం చేశారు. రైతు భరోసా ద్వారా రైతులకు సాయం అందిస్తున్నామని తెలిపారు.

యువతకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటుఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలన ఓ చరిత్ర అని ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ నాయకులపై ఆయన మండిపడ్డారు. పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ టీడీపీ నాయకులు విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. ఉద్యోగాలను అయినవాళ్లకే ఇస్తున్నారన్న ఆరోపణలు తగవని అన్నారు.

Related posts